మంత్రి హరీష్ రావు మరోసారి కాంగ్రెస్, బీజేపీ లపై విమర్శలు చేశారు. కేసీఆర్ నాయకత్వంలో 14 ఏళ్లు తెరాస, గులాబీజెండా కష్టపడితే తెలంగాణ వచ్చిందని..కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు ఉన్నా, బీజేపీ ప్రభుత్వం ఉన్నా మనకు జరిగింది ఏమీ లేదన్నారు. తెలంగాణ వచ్చాక సీఎం కేసీఆర్ తాగడానికి నీరు ఇంటింటికి వచ్చేలా చేశారని.. నీళ్ల బాధ కాంగ్రెస్ తీర్చిందా.? బీజేపీ తీర్చిందా.? ఏ పార్టీ తెలంగాణను అభివృద్ధి చేసిందో ప్రజలకు తెలుసు అని ఫైర్ అయ్యారు. బీజేపీ 17 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. ఏక్కడైనా ఉచిత కరెంటు ఇస్తున్నారా..?! కాంగ్రెస్ ఇస్తుందా ఏ రాష్ట్రంలోనైనా..? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ అంటే కాలిపోయే మీటర్లు. బీజేపీ అంటే బోర్లు, బావుల కాడ మీటర్లు, కారు గుర్తంటే 24 గంటల ఫ్రీ కరెంటు.. ఏది కావాలో రైతులు ఆలోచించాలన్నారు. దొమ్మాటలో 1 కోటీ 53 లక్షల రూపాయలను రైతు బంధు కింద 1338 మందికి ఎకరానికి 5 వేలు వానాకాల పంటకు ఇచ్చారు. దీపావళి తర్వాత మరో 5 వేలు సీఎం ఇస్తారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు రైతు శిస్తు అని వివధ రకాలుగా పన్నులు వసూలు చేస్తే..తెరాస వచ్చాక రైతుకే సీఎం కేసీఆర్ డబ్బులు ఇస్తున్నారని పేర్కొన్నారు. ఎరువులు కోసం గోస ఏక్కడైనా తెరాస పాలనలో ఉందా… రైతు బీమా 5 లక్షలు రైతు చనిపోతే ఇస్తున్నామా లేదా.? అని అన్నారు. బీజేపీకి మూడో సారి డిపాజిట్ కోల్పోవడంలో హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని..ఓడిపోతమని సిద్దిపేటలో నిన్న బీజేపీ హై డ్రామా చేస్తుందని మండిపడ్డారు. డబ్బులు నీ ఇంట్లోవి కాకపోతే ప్రచారం మానేసి ఎందుకు సిద్దిపేట పరుగెత్తుకొచ్చారని.. బీజేపీ అభ్యర్థిది పని చేసే ముఖామే అయితే ప్రజలకు పైసలు, సీసాలు, చీరేలు పంచి ఓటు అడుగుతారా అని ప్రశ్నించారు.
previous post
next post

