ప్రభుత్వం కొత్త ఇసుక విధానం అమలుచేయనున్న తరుణంలో టీడీపీ నాయకులకు బాధ కలుగుతోందని ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. విజయనగరం జిల్లా అభివృద్ధిపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐదేళ్లుగా ఇసుకపై టీడీపీ నేతలు బాగా సంపాదించుకున్నారని దుయ్యబట్టారు. ఇప్పుడు నూతన విధానంతో సంపాదన పోతుందన్న ఆందోళనతోనే నిరసనలు, ధర్నాలు చేపడుతున్నారని బొత్స మండిపడ్డారు.
ఇసుకపై తమ ప్రయోజనాలు దెబ్బతింటున్నాయనే టీడీపీ నాయకులు రాద్ధాంతం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము తీసుకువస్తున్న నూతన ఇసుక విధానం అమలుకు కొంత సమయం పడుతుందని అన్నారు. ఈ విషయం పట్ల ప్రజల్లో అవగాహన కలిగినా, టీడీపీ నేతలకు మాత్రం అర్థం కావడంలేదని ఎద్దేవా చేశారు.
ఫెలైన విద్యార్థి ఏడ్చినట్టుంది చంద్రబాబు ఎడుస్తున్నాడు !