telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మహేష్,రష్మిక నటించిన ‘మైండ్ బ్లాక్’ వీడియో సాంగ్ రిలీజ్

mahesh

`సరిలేరు నీకెవ్వరు` సినిమా విడుదలై నేటితో 50 రోజులు పూర్తవుతున్న సందర్భంగా చిత్రబృందం తాజాగా `మైండ్ బ్లాక్` పాట వీడియోను విడుదల చేసింది. సంక్రాంతి పండుగకు ప్రేక్షకుల ముందకు వచ్చిన ఈ చిత్రం భారీ వసూళ్లు సాధించింది. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమాలోని పాటలన్నీ అభిమానులను ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా `మైండ్ బ్లాక్` సాంగ్ మహేష్ ఫ్యాన్స్‌ను ఫుల్ ఖుషీ చేసింది.లుంగీ కట్టుకుని మరీ మహేష్ మాస్ స్టెప్పులకు వేసాడంటే ఇక ఫ్యాన్స్ ఆగుతారా. ఈ పాట కోసం మహేష్, రష్మిక వేసిన మాస్ స్టెప్పులు అభిమానులను ఫిదా చేశాయి. ‘బాబూ నూ సెప్పు.. వాడ్ని కొట్టమని డప్పు’.. సూపర్‌స్టార్ మహేష్ బాబు అభిమానులు థియేటర్లలో పూనకాలతో ఊగిపోయిన పాట ఇది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమా సంక్రాంతికి విడుదలై బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. ఈ సినిమా రిలీజ్ అయ్యి ఈరోజుకి సక్సెస్‌ఫుల్‌గా 50 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ‘మైండ్ బ్లాక్’ ఫుల్ సాంగ్‌ని రిలీజ్ చేసింది టీం. ఈ పాట రిలీజ్ అయిన గంటలోనే నాలుగు లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.అనిల్ రావిపూడి సరిలేరు నీకెవ్వరు సినిమాకు సంబంధించిన ప్రెస్ మీట్ పెట్టినప్పుడే ఫ్యాన్స్‌ మరిచిపోలేని మాస్ పాట అందిస్తానని చెప్పాడు. ఆయన ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడు.

Related posts