telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

నన్ను ఎవరు ఆపుతారో చూస్తా… కంగనా సవాల్

Kangana

బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తర్వాత ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ బాలీవుడ్ లోని పలువురుపైన చేస్తున్న ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి. ఈ క్రమంలో ఆమెకి కొన్ని బెదిరింపులు ఎదురయ్యయాని పలు మార్లు వెల్లడించింది. తన ఇంటి సమీపంలో కూడా ఎవరో కాల్పులు జరిపినట్టుగా కంగనా పేర్కొంది. అయితే తాజాగా తనని ముంబై లోకి రానివ్వమని పలువురు బెదిరించారని వెల్లడించింది. శివసేన ఎంపి సంజయ్ రౌత్ తనను బెదిరించారని కంగానా తన ట్విట్టర్ వేదికగా ఆరోపించారు. ఈ క్రమంలో వచ్చే సెప్టెంబర్ 9 వ తేదిన తానూ ముంబై వస్తున్నానని, అక్కడకి వచ్చాక ఎయిర్ పోర్ట్ లో ల్యాండ్ అయ్యాక సమయాన్ని కూడా పోస్ట్ చేస్తానని ఎవరైనా వచ్చి తనను అడ్డుకుంటారో చూస్తానని ట్వీట్ చేసింది. ఇప్పుడు ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక అటు కంగనా ప్రస్తుతం తన స్వస్థలమైన మనాలి, హిమాచల్ ప్రదేశ్ లో తన కుటుంబంతో కలిసి ఉన్నారు.

Related posts