తెలంగాణలో రాజకీయం రసవత్తరంగా మారింది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్లకు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ లేఖలు రాశారు. సెప్టెంబర్ 17న జాతీయ సమైక్యత దినంగా నిర్వహించాలని కోరారు.
ఎంఐఎం చీఫ్ ఒవైసీ శనివారం మీడియాతో మాట్లాడుతూ..సెప్టెంబరు 17న హైదరాబాద్ సంస్థానం విలీమైన రోజు.. కాబట్టి సెప్టెంబర్ 17ను జాతీయ సమైక్యత దినంగా నిర్వహించాలని అన్నారు.
సెప్టెంబర్ 17న ఓల్డ్ సిటీలోసెప్టెంబర్ 17న పాతబస్తీలో తిరంగా యాత్ర చేపడతామని ఒవైసీ ప్రకటించారు. అదే రోజు భారీ బహిరంగ సభ కూడా నిర్వహిస్తామన్నారు.ఈ కార్యక్రమాల్లో తమ ఎమ్మెల్యేలు, పార్టీ అభిమానులందరూ భారీగా పాల్గొంటారని ఎంఐఎం చీఫ్ తెలిపారు.
తెలంగాణ విమోచనం కోసం హిందూ -ముస్లింలు కలిసిపోరాడారని ఒవైసీ గుర్తు చేశారు. వలసవాదం, భూస్వామ్యవాదం , నిరంకుశత్వానికి వ్యతిరేకంగా అప్పటి హైదరాబాద్ రాష్ట్ర ప్రజలు చేసిన పోరాటాలు కేవలం ఒక భూభాగాన్ని “విముక్తి” చేయడానికి మాత్రమే కాదన్నారు.
హైదరాబాద్ రాష్ట్ర ప్రజలపై దాడులకు తెగబడ్డ రజాకార్లు అప్పుడే పాకిస్థాన్కు వెళ్లిపోయారని చెప్పారు. భారత్లో భాగంగా ఉండాలనుకున్న వారే ఇక్కడ ఉన్నారని ఒవైసీ లేఖలో స్పష్టం చేశారు.


పోలీసులు రాష్ట్రంలో భయాన్ని సృష్టిస్తున్నారు: జగ్గారెడ్డి