ఉద్యమ ద్రోహులకు కేసి ఆర్ పెద్ద పీట వేస్తున్నాడని కరీంనగర్ ఎమ్మెల్సీ అభ్యర్థి రవీందర్ సింగ్ ధ్వజమెత్తారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని నిత్యా రెడ్డి ఫంక్షన్ హాల్ లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ…… ఉద్యమకారులకు కేసీఅర్ అన్యాయం చేస్తున్నాడనే ఆవేదనతోనే తాను కరీంనగర్ ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని అన్నారు.
ఉద్యమ కారులను ఇవ్వాల్సిన పదవులు ఉద్యమ ద్రోహులకు ఇవ్వడం బాధాకరమని పేర్కొన్నారు. ఎంపిటిసి, జెడ్పీటీసీ ల ఆత్మగౌరవాన్ని కాపాడడానికే బరిలో ఉన్నానని అన్నారు. క్యాంపు రాజకీయాలతో నొట్ల కట్టలతో బాను ప్రసాద్ రావు విజయం సాధించాలని చూస్తున్నాడని అన్నారు. ఉద్యమ కారుల అండతో తప్పక విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు.
హైకోర్టు తీర్పు టీఆర్ఎస్ ప్రభుత్వానికి చెంపపెట్టు: శ్రీధర్ బాబు