telugu navyamedia
ఆంధ్ర వార్తలు

మంత్రి విశ్వరూప్‌కు బ్రెయిన్‌ స్ట్రోక్‌.. హైదరాబాద్‌ ఆస్పత్రిలో చికిత్స

ఏపీ రవాణాశాఖ మంత్రి పినిపే విశ్వరూప్ నిన్న స్వల్పంగా బ్రెయిన్ స్ట్రోక్ కు గురైయ్యారు.  కోనసీమ జిల్లాలో శుక్రవారం నిర్వహించిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి వర్థంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు.

అనంతరం ఆయన స్వల్ప అస్వస్థతకు గురి కావడంతో వెంటనే రాజమండ్రిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు స్వల్పంగా బ్రెయిన్‌ స్ట్రోక్‌కు గురైనట్లు తెలిపారు.

దాంతో ఆయనను కుటుంబ సభ్యులు హైదరాబాద్ లోని సిటీ న్యూరో సెంటర్లో చేర్పించారు. అక్కడ మంత్రిని పరీక్షించిన వైద్యులు.. నేడు ఆయన హెల్త్ బులెటిన్ ను విడుదల చేశారు. మంత్రికి బ్రెయిన్ స్ట్రోక్ వ‌చ్చింద‌ని వైద్యులు నిర్ధారించారు. ప్ర‌స్తుతం మంత్రి ఆరోగ్యం నిల‌క‌డ‌గానే ఉంద‌న్న వైద్యులు.. ఇప్పటికైతే ఆయన ఆరోగ్యానికి ప్రమాదం లేదన్నారు.

Related posts