telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

బీజేపీ ఎంపీలపై ఒవైసీ విమర్శలు

asaduddin owisi

ఎంఐఎం పార్టీ అధినేత హైద్రాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గాడ్సే ఓ దేశభక్తుడంటూ బీజేపీ ఎంపీలు సంబరాలు జరుపుకుంటున్నారని ఆరోపించారు. గాడ్సేను బహిరంగంగా నిందించేందుకు వారు నిరాకరిస్తున్నారని విమర్శిస్తున్నారు.

పైగా గాడ్సే ఉద్దేశాలను అర్థం చేసుకోవాలంటూ సూచిస్తున్నారని వ్యాఖ్యానించారు. వారు ఓ ఉగ్రవాదిని క్షమిస్తున్నారని, అతడి దుశ్చర్యను దేశభక్తిగా చిత్రీకరించే ప్రయత్నాలను ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించబోమని ఒవైసీ స్పష్టం చేశారు.

Related posts