telugu navyamedia
క్రీడలు వార్తలు

పంత్ పై ప్రశంసలు కురిపించిన సెహ్వాగ్…

ఇంగ్లాండ్ తో జరిగిన వన్డే సిరీస్ లో పంత్ అదరగొట్టిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ యువ వికెట్ కీపర్‌ సెహ్వాగ్ ప్రశంసలు కురిపించాడు. అతన్ని చూస్తే తన కెరీర్ ప్రారంభ రోజులు గుర్తుకొస్తున్నాయని తెలిపాడు. ఇండియా-ఇంగ్లండ్ సిరీస్‌లో సానుకూలాంశం ఏదైనా ఉందంటే అది రిషభ్ పంత్ ప్రదర్శననే అని కొనియాడాడు. పంత్ సెకండ్ పవర్ ప్లేను అద్భుతంగా వాడుకున్నాడని మెచ్చుకున్నాడు. పంత్ లాంటి ఆటగాళ్లు జట్టులో ఉండటం మంచిదని సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు. పంత్‌ తనకు నచ్చిన తీరులో చెలరేగుతాడని తెలిపాడు. అతన్ని చూస్తే నా కెరీర్ ప్రారంభం రోజులు గుర్తుకు వస్తున్నాయి. ఇతరులు ఏమనుకుంటున్నారనే విషయాన్ని పట్టించుకోడు. తన ఆట తాను ఆడుకుంటాడు. ఇదే జోరును కొనసాగిస్తూ పంత్ భారీ స్కోర్లు చేస్తే అతనికి తిరుగుండదు. 50 ఓవర్లు పూర్తిగా ఆడటం నేర్చుకోవాలి. చివరి వరకు బ్యాటింగ్ చేస్తూ ప్రస్తుతం చేస్తున్న 70, 80 పరుగులను సెంచరీలుగా మలిస్తే టీమిండియా తదుపరి సూపర్ స్టార్ అవుతాడు అని తెలిపాడు.

Related posts