telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

నేను ఏం మాట్లాడినా వివాదాస్పదం చేస్తున్నారు: గంటా

Ganta srinivas tdp

నేను ఏం మాట్లాడినా వివాదాస్పదం చేస్తున్నారని టీడీపీ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. విశాఖ వాసిగా ఇక్కడ రాజధానిని స్వాగతిస్తున్నానని గంటా చెప్పారు. సంబంధం లేని విషయాలను తెరపైకి తెస్తున్నారని అన్నారు. అమరావతి రైతులకు కూడా న్యాయం చేయాలని అన్నారు. అమరావతి రైతులకు సంఘీభావంగా నూతన సంవత్సర వేడుకలకు దూరంగా ఉండాలనే పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని తెలిపారు.

ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని టీడీపీ నేతలంతా డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు, పార్టీ స్టాండ్ కు విరుద్ధంగా గంటా మాట్లాడటం ఆసక్తికరంగా మారింది. దీంతోపాటు టీడీపీలో ఆయన కొనసాగుతారా? లేదా? అనే చర్చ కూడా జరుతుంతోంది. ఈ నేపథ్యంలో గంటా శ్రీనివాసరావు పార్టీ మారే ఉద్దేశం తనకు లేదని స్పష్టం చేశారు.

Related posts