telugu navyamedia
వార్తలు వ్యాపార వార్తలు సామాజిక

భారత మార్కెట్‌లో తొలి ఎలక్ట్రిక్‌ కారు

electric car mg motors

భారత మార్కెట్‌లో తొలి ఎలక్ట్రిక్‌ కారును ప్రముఖ కార్ల తయారీదారు ఎంజీ మోటార్స్‌ విడుదల చేసింది. ఎంజీ మోటార్స్‌ జెడ్‌ఎస్‌ ఈవీ పేరిట ఆ కారు విడుదలైంది. ఈ కారును రెండు వేరియెంట్లలో లాంచ్‌ చేశారు. ఎగ్జయిట్‌ వేరియెంట్‌ ధర రూ.20.88 లక్షలు ఉండగా, ఎక్స్‌క్లూజివ్‌ వేరియెంట్‌ ధర రూ.23.58 లక్షలుగా ఉంది.

ఇప్పటికే ఈ కార్లకు బుకింగ్స్‌ను నిలిపివేయగా, ముందుగా బుకింగ్‌ చేసుకున్న వారికి రూ.1 లక్ష తగ్గింపు ధరతో ఈ కార్లను విక్రయించనున్నారు. ఇక ప్రస్తుతానికి కేవలం ఢిల్లీ, ముంబై, అహ్మదాబాద్‌, బెంగళూరు, హైదరాబాద్‌ నగరవాసులకు మాత్రమే ఈ కారు అందుబాటులో ఉంటుంది.

Related posts