telugu navyamedia
రాజకీయ వార్తలు

జగన్ ది మూడు ముక్కల ఆట: సీపీఐ నేత నారాయణ

Narayana cpi

ఏపీకి మూడు రాజధానులు రావచ్చని సీఎం జగన్ అసెంబ్లీలో చేసిన ప్రకటనపై విమర్శలు వెల్లువిరుస్తున్న సంగతి తెలిసిందే. ఈ అంశంపై సీపీఐ నేత నారాయణ ఘాటుగా స్పందించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ పై వ్యంగాస్త్రాలు సంధించారు. జగన్ ది మూడు ముక్కల ఆట అని ఆయనది నెగెటివ్ ట్రెండ్ అని విమర్శించారు.

ఇక, పౌరసత్వ సవరణ చట్టం గురించి ఆయన మాట్లాడుతూ, దీని వల్ల దేశానికి ఒరిగేదేమీ లేదని, ఓట్ల కోసం మతం పేరుతో దీనిని తీసుకొచ్చారని విమర్శించారు. బీజేపీ, సంఘ్ పరివార్, ఆర్ఎస్ఎస్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రోహింగ్యాల కన్నా ఆర్ఎస్ఎస్, బీజేపీ వాళ్లే రాక్షసులని తీవ్ర విమర్శలు చేశారు.

Related posts