అక్కినేని వారి కోడలు, టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఇటీవలే సమంత బిగ్బాస్ షో ద్వారా తొలిసారి వ్యాఖ్యాతగా వ్యవహరించి అభిమానులను అలరించారు. ‘వైల్డ్ డాగ్’ షూటింగ్ కోసం నాగ్ ప్రస్తుతం హిమాలయాల్లో ఉండడంతో బిగ్ బాస్ దసరా ఎపిసోడ్ బాధ్యతను కోడలుపిల్ల సామ్ భుజాలపైన వేశారు. మూడు గంటల మెగా ఎపిసోడ్ను ఆసాంతం నవ్వుతూ వినోదవంతంగా మలిచారు. ఇందుకు కార్తికేయ, పాయల్ రాజ్పుత్, హైపర్ ఆదిలాంటి సెలబ్రిటీలు కూడా తమ వంతు సపోర్ట్ చేశారు. దీంతో దసరా ఎపిసోడ్ను బ్లాక్బస్టర్ అయ్యింది. కానీ కొందరు సమంతను, బిగ్ బాస్ ప్రోగ్రాంను ట్రోల్ చేశారు. ఈ ఎపిసోడ్ అనుకున్నంతగా ఆకర్షించలేదని పేర్కొంటూ విమర్శించారు. అయితే తాజాగా ఆ ఎపిసోడ్ తాలూకు టీవీ రేటింగ్ బయటకు రావడంతో సదరు విమర్శకుల నోటికి తాళం పడింది. సమంత ఎపిసోడ్కి తక్కువ రేటింగ్ వచ్చిందని తప్పుడు ప్రచారాలు పుట్టించడమే గాక, బిగ్ బాస్ షో అనేది అక్కినేని ఫ్యామిలీ షోగా మారిందని విమర్శలు గుప్పించారు కొందరు నెటిజన్లు. కానీ తాజాగా వచ్చిన రేటింగ్ ప్రకారంగా చూస్తే.. ఆ ఎపిసోడ్లో సమంత సత్తా చాటిందని స్పష్టంగా తెలుస్తోంది. దసరా రోజు టెలికాస్ట్ అయిన బిగ్ బాస్ 4కు 11.4 టీవి రేటింగ్ వచ్చిందని అఫీషియల్ సమాచారం బయటకొచ్చింది. కాగా మరో రెండు వారాలు కూడా బిగ్ బాస్ హోస్ట్గా సమంతనే చేస్తుందని భావించిన ఆమె అభిమానులకు నిరాశే ఎదురైంది. కేవలం దసరా ఎపిసోడ్ మాత్రమే చేసి ఆమె నిష్క్రమించింది. దీంతో నాగార్జున ప్రతి వారాంతంలో హైదరాబాద్ వచ్చి బిగ్ బాస్ షూటింగ్ లో పాల్గొంటున్న విషయం తెలిసిందే.