టాలీవుడ్ కింగ్ నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన తాజా చిత్రం “మన్మథుడు-2”. భారీ అంచనాల నడుమ ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి మిశ్రమ స్పందన వచ్చింది. మరోవైపు అనసూయ కథనం, విశాల్ రీమేక్ అయోగ్య, కన్నడ మహాభారతం డబ్బింగ్ కురుక్షేత్ర లాంటి సినిమాలతో పాటు శనివారం సంపూర్ణేష్ కొబ్బరిమట్ట సినిమాలు కూడా “మన్మథుడు-2” చిత్రంతోపాటే విడుదలయ్యాయి. సినిమాపై ఉన్న హైప్, ఆల్రెడీ మన్మథుడు లాంటి క్లాసిక్ మూవీ టైటిల్తో వస్తోన్న సినిమా కావడంతో పాటు నాగ్ ఫ్యామిలీ చేసిన ప్రమోషన్లతో సినిమా సూపర్ హిట్ అవుతుందనే అందరూ అనుకున్నారు. ఈ సినిమాకు ఏకంగా రూ.24 కోట్ల వరల్డ్ వైడ్ ప్రి రిలీజ్ బిజినెస్ కూడా జరిగింది. కానీ ఫస్ట్ షోకే అందరి అంచనాలను తారుమారు చేస్తూ నెగెటివ్ టాక్ తెచ్చుకుంది ఈ చిత్రం. నాగార్జున ఈ వయస్సులో చేయాల్సిన సినిమా కాదన్న విమర్శలు వచ్చేశాయి. ప్రేక్షకుల నుంచే కాకుండా క్రిటిక్స్ నుండి మిశ్రమ స్పందన లభించింది. రెండు తెలుగు రాష్ట్రాలలో మన్మథుడు 2 ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. ఇక ఓవర్సీస్లో కూడా ఈ సినిమా అట్టర్ ప్లాప్ టాక్ తెచ్చుకుంది. గురువారం యూఎస్ ప్రీమియర్స్ ద్వారా ఈ మూవీ $ 82,284 గ్రాస్ వసూళ్లు సాధించిందని సమాచారం. ఇక శుక్రవారం అప్డేట్ చూసినా $ 23,766 గ్రాస్ వసూళ్లతో ఇప్పటివరకు అక్కడ మొత్తం $ 1, 23,236 గ్రాస్ వసూళ్లు సాధించిందని తెలుస్తుంది. మూవీపై మిశ్రమ స్పందన ఉన్న నేపథ్యంలో మన్మధుడు 2 మూవీ ఏమాత్రం వసూళ్లు సాధిస్తుందో చూడాలి.
previous post
పాప పోలిక విషయమై సమీరారెడ్డిపై విమర్శలు