విజయ్ దేవరకొండ నటించిన “అర్జున్ రెడ్డి” చిత్రం ఎలాంటి విజయాన్ని సాధించిందో అందరికి తెలిసిందే. ఈ చిత్రాన్ని హిందీ, తమిళ భాషతెలుగులో ల్లో రీమేక్ చేస్తున్నారు. హిందీలో “కబీర్ సింగ్” పేరుతో తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో షాహిద్ కపూర్, కియారా అద్వానీ జంటగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముస్సోరీలో జరుగుతోంది. అయితే ఈ సినిమా సెట్లో ఓ వ్యక్తి మృతి చెందడం కలకలం సృష్టిస్తోంది.
ఈ సినిమాను పని చేస్తున్న రాము అనే 30 ఏళ్ళ టెక్నిషియన్ డెహ్రాడూన్ లోని ఓ జనరేటర్ కంపెనీలో పని చేస్తుంటాడు. “కబీర్ సింగ్” సినెమా చిత్రీకరణకు సంబంధించిన జనరేటర్ పనులను ఆయన చూస్తున్నారు. నిన్న జనరేటర్ కు సంబంధించి ఆయిల్ ను చెక్ చేస్తున్న సమయంలో అతడు కట్టుకున్న మఫ్లర్ జనరేటర్ లో ఇరుక్కోవడంతో అతని ముఖానికి, తలకు బలమైన గాయాలు తగిలాయి. అతన్ని వెంటనే ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. పోలిసుల విచారణలో ఇది అనుకోకుండా జరిగిన సంఘటన అని తేలడంతో బాడీ ని పోస్టుమార్టం కోసం తరలించారు.