తెలంగాణలో రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. దాదాపు 85 శాతానికి పైగా పోలింగ్ నమోదు అయినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఉదయం ఏడు గంటలకే ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం ఒంటి గంటకు ముగిసింది. అయితే నిర్ణీత సమయంలోపు లైన్లో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం కల్పించారు. మధ్యాహ్నం రెండు గంటలకు ఆయా పోలింగ్ కేంద్రాల్లో కౌంటింగ్ కొనసాగుతోంది. రెండవ విడతలోనూ టీఆర్ఎస్ తన సత్తా చాటుతోంది.
దాదాపు 643 పంచాయతీల్లో టీఆర్ఎస్ మద్దతుదారులు గెలుపొందగా 46 పంచాయతీల్లో కాంగ్రెస్ మద్దతుదారులు గెలుపొందారు. జిల్లాల వారీగా కూడా టీఆర్ఎస్ ముందంజలో నిలిచింది.మూడు విడతల్లో జరగనున్న ఈ ఎన్నికల్లో గత సోమవారం తొలి విడత పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. నేడు రెండు విడతల పోలింగ్ జరగగా ఈనెల 30వ తేదీన మూడో విడత పోలింగ్ జరగనుంది.