అనీల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రూపొందుతున్న చిత్రం “సరిలేరు నీకెవ్వరు”. 90లలో లేడీ సూపర్స్టార్గా అద్భుతమైన స్టార్డమ్ సంపాదించిన విజయశాంతి మళ్ళీ 13 ఏళ్ళ తర్వాత సరిలేరు నీకెవ్వరు అనే చిత్రంతో రీ ఎంట్రీ ఇస్తుండడంతో ఈ సినిమాపై ఆమె అభిమానులలో చాలా ఆసక్తి నెలకొంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సరిలేరు నీకెవ్వరు చిత్రంలో మహేష్ మేజర్ అజయ్ కృష్ణ పాత్రలో కనిపించనున్నారు. ఆయన సరసన రష్మిక మందన్న కథానాయికగా నటిస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. చిత్రాన్ని దిల్ రాజు, అనిల్ సుంకర, మహేష్ సంయుక్తంగా నిర్మిస్తుండగా, ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 12న సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. తాజాగా దీపావళి సందర్భంగా “సరిలేరు నీకెవ్వరు” మూవీ నుండి విజయ శాంతి లుక్ విడుదల చేసారు. భారతి పాత్రలో అలరించనుంది. ఇక దీపావళి సందర్భంగా ఈ సినిమా నుంచి మహేష్ చిత్ర పోస్టర్ కూడా విడుదలైన సంగతి తెలిసిందే. ఈ పోస్టర్లో మహేష్ బుల్లెట్ నడుపుతూ చాలా స్టైలిష్గా కనిపించారు. ఈ పోస్టర్ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. దాదాపు 69000 మంది ఈ పోస్టర్ని లైక్ చేశారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక పోస్టర్కి ఇన్ని లైక్స్ రావడం ఇదే మొదటిసారి అని అంటున్నారు. పోస్టర్కి వచ్చిన క్రేజ్ని బట్టి చూస్తుంటే సినిమా కూడా మంచి విజయం సాధించడం ఖాయం అని అంటున్నారు.