telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

షర్మిలతో మాజీ ఎమ్మెల్సీ చర్చలు…

తెలంగాణలో వైఎస్ షర్మిల వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇక, ఇవాళ షర్మిలను కలిశారు మాజీ ఎమ్మెల్సీ మాగం రంగారెడ్డి… వైఎస్ఆర్ హయాంలో, కిరణ్‌కుమార్ రెడ్డి సమయంలో.. ఎమ్మెల్సీగా పనిచేసిన ఆయన.. షర్మిలతో చర్చలు జరపడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇక, సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన రంగారెడ్డి.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మీద ఉన్న అభిమానంతో షర్మిలను మర్యాదపూర్వకంగా కలిశానన్నారు.. షర్మిలపై కొందరు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు.. ఇది సరికాదని హితవుపలికిన ఆయన.. వైఎస్ చనిపోయినా వారి పిల్లలు ప్రజల కోసం మంచి పనులు చేస్తున్నారు.. ఇది అభినందనీయం అన్నారు. మహిళలను ప్రోత్సహించాలి. వైఎస్ కుటుంబ సభ్యులు కూడా తెలంగాణ ప్రాంతానికి ఎన్నో మంచి పనులు చేశారని.. ఔటర్ రింగ్ రోడ్డు వంటి ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టారని గుర్తుచేశారు రంగారెడ్డి.. వైఎస్ షర్మిలపై ఆవాకులు చెవాకులు మాట్లాడొద్దని మా పార్టీ నేతలకు సూచిస్తున్నాన్న ఈ కాంగ్రెస్ నేత, నిజాయితీ పనులు చేసే వారిని అభినందించాలన్నారు.

Related posts