ఢిల్లీ ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ ఆదివారం మూడోసారి ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేయాల్సిందిగా ప్రధాని మోదీని కేజ్రీవాల్ కోరారు. ఏ రాష్ట్ర ముఖ్యమంత్రిని కానీ, ఇతర రాష్ట్రాల నేతలను కానీ తమ ప్రమాణస్వీకారానికి ఆహ్వానించడం లేదని నిన్న ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఢిల్లీలోని రాంలీలా మైదాన్ లో 51 ఏళ్ల కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో, మోదీకి కేజ్రీవాల్ ఆహ్వానం పలకడం విశేషం. మరి కేజ్రీవాల్ ఆహ్వానం మేరకు ప్రమాణస్వీకారం కార్యక్రమానికి మోదీ వస్తారా? లేదా? అనే విషయం ఆసక్తికరంగా మారింది.
చంద్రబాబు పార్టీ శ్రేణులకు ఏం నమ్మకం ఇవ్వగలడు: విజయసాయి