telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

చంద్రబాబు ఔట్ డేటెడ్ ..లోకేశ్ ఇంకా అప్ డేట్ కాలేదు: ఏపీ చీఫ్ విప్

srikanthreddy ycp

కేసులకు భయపడి చంద్రబాబు మళ్లీ ప్రధాని మోదీ కాళ్లు పట్టుకోవడానికి సిద్ధమయ్యారని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి అన్నారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు నిజాయతీ పరుడైతే తనపై ఉన్న కేసులకు సంబంధించి తెచ్చుకున్న స్టే ఆదేశాలను వెనక్కి తీసుకోవాలన్నారు. ఆయన జీవితమంతా స్టేలు తెచ్చుకోవడంతోనే సరిపోయిందని విమర్శించారు. చంద్రబాబు ఔట్ డేటెడ్ నేత అయితే, లోకేశ్ అప్ డేట్ కాని నేత అని శ్రీకాంత్ రెడ్డి ఎద్దేవా చేశారు.

అరాచక శక్తులను ప్రోత్సహించే విధంగా చంద్రబాబు మాట్లాడుతున్నారన్నారు. చింతమనేని దౌర్జన్యాలు చంద్రబాబు, యనమలకు కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం ప్రవేశ పెడితే మతానికి లింకు పెట్టడం సమంజసమేనా? అంటూ ప్రశ్నించారు. తెలంగాణలో టీడీపీ శకం ముగిసిందని, ఇక ఏపీ లో కూడా టీడీపీ కనుమరుగవుతుందని అన్నారు.

Related posts