telugu navyamedia
ఆంధ్ర వార్తలు

నేడే హ‌స్తినాకు చంద్ర‌బాబు ప‌య‌నం

ఏపీలో రాజ‌కీయాలు వేడేక్కాయి. రాష్ట్రంలోని నెల‌కొన్న‌ పరిస్థితులు, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పట్టాభి ఇంటిపై జరిగిన‌ దాడి నేపథ్యంలో చంద్రబాబు ఈ రోజు హస్తినాకు పయనం కానున్నారు. చంద్రబాబుతో పాటు ఎంపీలు సహా సుమారు 18 మంది బృందం వెళ్లనున్నారు.

ఈ మధ్యాహ్నం పన్నెండున్నర గంటలకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను కలుస్తారు. ఏపీలో వ్యవస్థలపై జరుగుతున్న దాడులపై , మాదకద్రవ్యాలు, రాష్ట్రపతికి ఫిర్యాదు చేయనుంది బాబు నాయకత్వంలోని బృందం.
రాష్ట్రాన్ని కాపాడటానికి రాష్ట్రపతి పాలన విధించాలని ఆ పార్టీ కోరనుంది.

Chandrababu Naidu Delhi Tour : ఏపీ పాలిట్రిక్స్ - చంద్రబాబు టీం ఢిల్లీ టూర్  | Chandrababu Naidu Delhi Tour

యితే ఢిల్లీ పర్యటన అజెండాపై చంద్రబాబు.. శనివారం పార్టీ ముఖ్యనేతలతో సమావేశమైన చంద్రబాబు.. పలు విషయాలపై చర్చించారు. ఢిల్లీ పర్యనటలో ఎలాంటి విషయాలు మాట్లాడాలనే దానిపై నేతలతో చర్చించారు. తన రాజకీయ జీవితంలో ఎప్పుడూ ఇటువంటి భౌతిక దాడులకు దిగలేదని, అందరం కలిసి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుని సిద్ధాంతం ప్రకారం ఓటర్లకు వెళ్దామని నేతలకు సూచించిన‌ట్లు స‌మాచారం.

Related posts