telugu navyamedia
ఆంధ్ర వార్తలు క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు

మదనపల్లి జంట హత్య కేసులో మరో ట్విస్ట్‌ !

మదనపల్లిలో సొంత కూతుళ్ల హత్యల కేసులో తల్లిదండ్రులు పురుషోత్తమ్‌, పద్మజను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. కరోనా టైంలో ఇంట్లో ఉంటూ… పూర్తిస్థాయిలో ఆధ్యాత్మికంగా లీనమైన కుటుంబం సభ్యులు… ఒకరకమైన మూఢత్వంలోకి వెళ్లిపోయారు. ఉన్మాదభక్తితో కన్నప్రేమను మర్చిపోయారా తల్లిదండ్రులు. కడుపున పుట్టిన పిల్లల్ని… కర్కషంగా చంపేశారు. మదనపల్లి జంట హత్యల కేసులో రోజుకో ట్విస్ట్‌ చోటు చేసుకుంటూనే ఉంది.  మదనపల్లి జైలులో తొటి ఖైదీలకు చుక్కలు చూపించిన… నిందితులను విశాఖ ఆస్పత్రికి అధికారులు తరలించారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు మదనపల్లె నిందితులు. విశాఖ మానసిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు  పురుషోత్తం నాయుడు, పద్మజ. వీరికి సాధారణ వైద్యం అందిస్తూ, క్లినికల్ పరీక్షలు నిర్వహిస్తుంది వైద్య సిబ్బంది. ఇప్పటికీ చనిపోయిన ఇద్దరు కుమార్తెలు ఇద్దరూ తిరిగి వస్తారనే భ్రమలో ఉన్న నిందితులు… వైద్యులకు కూడా అదే చెబుతున్నారు. ఖచ్చితంగా తిరిగి వస్తారంటు వైద్యులతో పద్మజ వాదిస్తోంది. పోలీసుల బందోబస్తు నడుమ వేర్వేరు వార్డుల్లో చికిత్స అందిస్తున్నారు. వారి ప్రవర్తనలో మార్పుల్ని గమనిస్తూ, కుటుంబ నేపథ్యం, పిల్లల ప్రవర్తనపై ఆరా తీస్తున్నారు వైద్యులు.

Related posts