ఆగస్ట్ 9న సూపర్ స్టార్ మహేష్ బాబు 44వ పడిలోకి అడుగు పెడుతున్నాడు. ఈ సందర్భంగా ఆయన అభిమానులు ఇప్పటికే మహేష్ బర్త్డేకి సంబంధించిన పలు కార్యక్రమాలతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలు కూడా చేపట్టేందుకు సిద్ధమయ్యారు. ఈ సమయంలో ప్రతిష్ఠాత్మక మేడమ్ టుస్సాడ్స్ సంస్థ అభిమానులకి ఓ శుభవార్త అందించింది. “మేడమ్ టుస్సాడ్స్ నిర్వహిస్తున్న కంటెస్టెంట్లో గెలిచిన వారు సింగపూర్లో ఉన్న మహేష్ బాబు మైనపు విగ్రహాన్ని చూసే అవకాశం పొందుతారు. ఈ కంటెస్టెంట్లో మహేష్ బాబు కూడా న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తారు. ఇంకెందుకు ఆలస్యం… ఈ పోటీలో పాల్గొని మీ ఫేవరేట్ స్టార్కి వెరైటీ బర్త్డే విషెస్ పంపించండి” అని తమ ట్విట్టర్లో పేర్కొంది మేడమ్ టుస్సాడ్స్. దక్షిణాది హీరోలలో ప్రభాస్, మహేష్ మైనపు విగ్రహాలని మాత్రమే మేడమ్ టుస్సాడ్స్ నెలకొల్పిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది మార్చి 25న అభిమానుల కోసం మహేష్ మైనపు విగ్రహాన్ని హైదరాబాద్ నగరంలోని ఏఎంబీ సినిమాస్లో ఆవిష్కరించగా, ఆ తర్వాత సింగపూర్కి తరలించారు. ప్రస్తుతం మహేష్ అనీల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న “సరిలేరు నీకెవ్వరు” చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారు.
previous post