telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

కంపెనీ తనిఖీల కోసం టాస్క్‌ఫోర్స్‌ కమిటీ: మంత్రి బొత్స

botsa ycp

ఎల్జీ పాలిమర్స్‌ తరహా కంపెనీల్లో తనిఖీల కోసం టాస్క్‌ఫోర్స్‌ కమిటీ ఏర్పాటు చేశామని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. పాలిమర్స్‌ ఘటనపై చర్చకు టీడీపీ అధినేత చంద్రబాబు ఎక్కడికి వస్తారో చెప్పాలని, ఆయన విశాఖకు వస్తే చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. కరోనా నియంత్రణలో అధికారులు తీవ్రంగా కృషి చేస్తున్నారని కొనియాడారు.

డాక్టర్ సుధాకర్‌పై తమకు కక్ష లేదని, దళితుల అభ్యున్నతికి వైసీపీ కృషి చేస్తోందని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. వైద్య సిబ్బందికి కావాల్సిన మాస్కులు, పీపీఈ కిట్లు ఉన్నాయని, కంటైన్మెంట్‌ జోన్‌ నుంచి ప్రజలు బయటకు రావొద్దని బొత్స సూచించారు. విశాఖలో 490మంది వలస కార్మికులు ఉన్నారని, వారిని స్వస్థలాలకు పంపిస్తామన్నారు.

Related posts