విలక్షణ నటుడు, రాజకీయనేత కమల్ హాసన్ మక్కల్ నీది మయ్యం(ఎంఎన్ఎం) పార్టీని స్థాపించిన సంగతి తెలిసిందే. రాబోయే లోక్ సభ ఎన్నికల్లో 39 స్థానాల నుంచి పోటీ చేస్తామని కమల్ ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) కమల్ పార్టీకి గుర్తును కేటాయించింది. మక్కల్ నీది మయ్యం పార్టీకి ‘బ్యాటరీ టార్చ్’ గుర్తును కేటాయిస్తున్నట్లు ఈసీ తెలిపింది.
కమల్ హాసన్, తమ పార్టీకి ‘బ్యాటరీ టార్చ్’ గుర్తును కేటాయించడంపై హర్షం వ్యక్తం చేశారు. ఇది తమ పార్టీకి సరైన గుర్తు అని వ్యాఖ్యానించారు. తమిళనాడుతో పాటు భారత రాజకీయాల్లో సరికొత్త శకానికి ఎంఎన్ఎం, బ్యాటరీ టార్చ్ నాంది పలుకుతాయని అభిప్రాయపడ్డారు.