telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ప్రధానమంత్రి పిలుపును గౌరవిద్దాం… దీపాలతో కరోనా చీకటిని తరిమికొడదాం : చిరంజీవి

chiranjeevi

ఉగాది రోజున చిరంజీవి ట్విట్టర్‌లో చేరిన సంగతి తెలిసిందే. ఆ రోజు నుంచి ఆయన తన ట్వీట్లతో ఫ్యాన్స్‌ను కట్టిపడేస్తున్నారు. మంచి ఎంటర్‌టైన్మెంట్‌తో పాటు సందేశాన్ని కూడా తన అభిమానులకు ఇస్తున్నారు. తాజాగా భారతీయులంతా కలిసి ఏప్రిల్‌ 5న కరోనా వైరస్‌ అనే అంధకారాన్ని తరిమికొట్టాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. 130 కోట్ల మంది ప్రజల మహా సంకల్పాన్ని మరింత ఘనంగా చాటాలని.. దీని కోసం ఈ ఆదివారం (ఏప్రిల్ 5న) రాత్రి 9 గంటలకు 9 నిమిషాల పాటు లైట్లు ఆపేసి టార్చ్‌, మొబైల్‌ లైట్‌లు, కొవ్వొత్తులు, దివ్వెలను వెలిగించాలని దేశ ప్రజలను ప్రధాని కోరుతూ ఒక వీడియో మెసేజ్‌ను విడుదల చేశారు. ఈ కార్యక్రమాన్ని ఎవరి ఇంటి గుమ్మం వద్ద వారే జరుపుకోవాలని.. ఎవరూ రోడ్లపైకి రావొద్దని మోదీ సూచించారు. సామాజిక దూరమనే లక్ష్మణ రేఖను ఎవ్వరూ దాటొద్దని అన్నారు. మోదీ పిలుపునిచ్చిన కార్యక్రమానికి అన్ని వైపుల నుంచి మద్దతు లభిస్తోంది. జనతా కర్ఫ్యూ మాదిరిగానే ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేయాలని పలువురు ప్రముఖులు ప్రజలను కోరుతున్నారు. వీరిలో మెగాస్టార్ చిరంజీవి కూడా ఉన్నారు. ప్రధాన మంత్రి పిలుపును ప్రతి ఒక్కరూ గౌరవించాలని చిరంజీవి తెలుగు రాష్ట్రాల ప్రజలను కోరారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ట్వీట్ చేశారు. ‘‘మన ప్రియతమ ప్రధాన మంత్రి పిలుపును గౌరవిస్తూ ఏప్రిల్ 5న రాత్రి 9 గంటలకు 9 నిమిషాల పాటు మనమంతా దివ్వెలను వెలిగించి కరోనా వల్ల ఏర్పడిన చీకటిని తరిమికొడదాం. మన దేశం ఒక్కటవుదాం, మనం ఒకరికోసం ఒకరం నిలబడతామని పునరుద్ఘాటిద్దాం’’ అని చిరంజీవి తన ట్వీట్‌లో పేర్కొన్నారు. చిరంజీవి ట్వీట్‌కు అభిమానుల నుంచి విపరీతమైన స్పందన వస్తోంది.

Related posts