telugu navyamedia
వ్యాపార వార్తలు

ఫోర్బ్స్ 30లో తెలుగు తేజాలు … కేటీర్ అభినందనలు

forbes

ఫోర్బ్స్ తాజాగా ఓ జాబితాను విడుదల చేసింది. అందులో మన తెలుగు తేజాలు ఆరుగురికి చోటు దక్కడం విశేషం.30 అండర్ 30 ఆసియా పేరుతో విడుదలైన ఈ జాబితాలో పది విభాగాలకు గానూ మొత్తం 300 మందిని ఎంపిక చేశారు. ఇక అందులో భారత్ నుంచి 69 మంది ఎంపిక కాగా వారిలో ఆరుగురు తెలుగువారు ఉన్నారు. ప్రేమ్‌ కుమార్‌ (మారుత్‌ డ్రోన్స్‌), అశ్విన్‌ మోచర్ల (దీ థిక్‌ షేక్‌ ఫ్యాక్టరీ), సందీప్‌ బొమ్మి (యాడ్‌ ఆన్‌ మో), విహారి (అర్బన్‌ కిసాన్‌), పవన్‌ కుమార్‌ చందన (స్కై రూట్‌ ఏరోస్పేస్‌)లు జాబితాలో చోటు దక్కించుకున్నారు. వినూత్నంగా అలోచించి కొత్త తరహ వ్యాపారాలను తెరపైకి తీసుకురావడమే కాకుండా వాటిల్లో వీరు విజేతలుగా నిలిచారని ఫోర్బ్స్ సంస్థ వెల్లడించింది. ఈ ఆరుగురిలో ఐదుగురు హైదరాబాదీలు కావడం విశేషం. ఇక వారి ఘనతకు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ప్రశంసలు కురిపించడం జరిగింది. ఇప్పటి యువతరం వినూత్నమైన ఐడియాలతో అద్భుతమైన ఆవిష్కరణలు చేస్తున్నారని కేటీఆర్ పేర్కొన్నారు. తమ ఆలోచనలకు అనుగుణంగా ముందుకు సాగుతున్న యువ పారిశ్రామికవేత్తలకు ఎలప్పుడూ సహకారం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్దంగా ఉందని ఆయన తెలిపారు.

Related posts