telugu navyamedia
ట్రెండింగ్ వ్యాపార వార్తలు

హైదరాబాద్‌ : రూ.75కే .. మెట్రోరైలు స్మార్ట్‌ కార్డు, ఉగాది కనుక .. త్వరపడాలి..

hightech city metro by this month last week

ఉగాది కానుకగా ఎల్‌ అండ్‌ టీ హైదరాబాద్‌ మెట్రోరైలు సంస్థ నగరంలో మెట్రోరైలులో ప్రయాణించేవారికి స్మార్ట్‌ కార్డు ధరను తగ్గించింది. ఈ కార్డును ఇప్పుడు రూ.75కే కొనుగోలు చేయవచ్చు. అయితే మూడు నెలల వరకు ఈ సదుపాయం కల్పిస్తున్నట్లు సంస్థ వెల్లడించింది. ఇందులో రూ.50 వరకు ప్రయాణానికి ఉపయోగించుకోవచ్చు. నగదు అయిపోగానే కనీసం రూ.50, గరిష్ఠంగా 3వేల వరకు రీఛార్జ్‌ చేసుకొనే అవకాశం ఉంది.

ఇప్పటివరకు కార్డు కోసం రూ.150 చెల్లించాల్సి వచ్చేది. ఈ మొత్తంలో రూ.20 తిరిగి చెల్లించరు. మిగతా మొత్తం ప్రయాణానికి ఉపయోగించుకోవచ్చు. ఇప్పటివరకు 6 లక్షలపైగా కార్డులను మెట్రో విక్రయించింది. నిత్యం ప్రయాణించే 2.20 లక్షల మందిలో 1.50 లక్షల మంది వరకు వినియోగిస్తున్నారు.

Related posts