రాకింగ్ స్టార్ యశ్ హీరోగా తెరకెక్కిన “కేజీఎఫ్ చాప్టర్-1” ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద 250 కోట్ల వసూళ్లు సాధించింది. ఈ సీక్వెల్లో తొలి భాగాన్ని మించి భారీ యాక్షన్ని చూపించనున్నారు. కేజీఎఫ్ అంటే కోలార్ బంగారు గనులు (కోలార్ గోల్డ్ ఫీల్డ్స్). దశాబ్ధాల క్రితం కోలార్ బంగారు గనుల్లో మాఫియా కథతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. కేజీఎఫ్ గనులపై ప్రపంచ మాఫియా కన్ను ఎలా ఉండేది అన్నదానిని తొలి భాగంలోనే అద్భుతంగా రివీల్ చేశారు. పార్ట్ 2లో ఇంకా భీకర మాఫియాని పతాక స్థాయిలో చూపించబోతున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో హోంబలే ఫిలింస్ సంస్థ అత్యంత భారీ బడ్జెట్తో నిర్మించిన ఈ చిత్రాన్ని కైకాల సత్యనారాయణ సమర్పించారు. కన్నడం, హిందీ, తెలుగు, తమిళంలో చక్కని వసూళ్లతో ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ ఫ్రాంఛైజీలో సీక్వెల్ సినిమా ‘కేజీఎఫ్ ఛాప్టర్ 2’ శరవేగంగా పూర్తవుతోంది. తాజాగా ఈ సినిమాలోని అధీరా పాత్రలో ఉన్న సంజయ్ దత్ లుక్ని చిత్రయూనిట్ విడుదల చేసింది. సంజయ్దత్ లుక్కి చక్కని స్పందన వచ్చిందని తెలిపిన నిర్మాతలు చిత్ర షూటింగ్కు సంబంధించిన షెడ్యూల్స్ వివరాల్ని వెల్లడించారు.
“కేజీఎఫ్ ఛాప్టర్ 2 చిత్రీకరణ జెట్ స్పీడ్తో పూర్తవుతోంది. ఇప్పటికే మైసూర్ షెడ్యూల్స్ పూర్తయ్యాయి. ప్రస్తుతం బెంగళూరు కోలార్ మైన్స్లో వేసిన భారీ సెట్స్లో మూడో షెడ్యూల్ షూటింగ్ జరుగుతోంది. 23 ఆగస్టు నుంచి హైదరాబాద్ పరిసరాల్లో షెడ్యూల్ కొనసాగుతుంది. నెలాఖరుకు అది పూర్తవుతుంది. ఆ తర్వాత కర్నాటక- భళ్లారి మైన్స్లో సంజయ్దత్ అధీరా పాత్రపై చిత్రీకరణ సాగనుంది. ఈ షెడ్యూల్తో మెజారిటీ పార్ట్ చిత్రీకరణ పూర్తవుతుంది. వచ్చే ఏడాది సమ్మర్లో సినిమాని రిలీజ్ చేయనున్నాము” అని తెలిపారు.
వరుణ్ ధావన్కు ఇద్దరు హీరోల వల్లే కష్టాలు…!?