పాతబస్తీలో అమ్మవారి బోనాల జాతర ఘనంగా జరుగుతోంది. లాల్దర్వాజా సింహవాహిని అమ్మవారి ఆలయంలో తెల్లవారుజామున నుంచే బోనాల ఉత్సవం కన్నులపండువగా జరుగుతోంది.
ఆషాఢమాసంబోనాల పండుగ సందర్భంగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు బోనాల శుభాకాంక్షలు తెలిపారు.
రాష్ట్ర ప్రజలంతా ఆయురారోగ్యాలతో , సుఖసంతోషాలతో సుభిక్షంగాజీవించేలా అమ్మవారి ఆశీస్సులు కలకాలం కొనసాగాలని సీఎం కేసీఆర్ ప్రార్థించారు.
కుటుంబసభ్యులతో కలిసి సంతోషకర వాతావరణంలో వేడుకలను నిర్వహించుకోవాలని సూచించారు. వర్షాలు, వరదల నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలన్నారు. రాష్ట్ర ప్రజలందరికీ అమ్మవారి ఆశీర్వాదాలు అందాలని గవర్నర్ ఆకాంక్షించారు.