telugu navyamedia
తెలంగాణ వార్తలు

తెలంగాణ‌ ప్రజలకు గవర్నర్ త‌మిళ‌సై​, సీఎం కేసీఆర్‌ బోనాల శుభాకాంక్షలు

పాతబస్తీలో అమ్మవారి బోనాల జాతర ఘనంగా జరుగుతోంది. లాల్‌దర్వాజా సింహవాహిని అమ్మవారి ఆలయంలో తెల్లవారుజామున నుంచే బోనాల ఉత్సవం కన్నులపండువగా జరుగుతోంది.

ఆషాఢమాసంబోనాల పండుగ సందర్భంగా గవర్నర్​ తమిళిసై సౌందరరాజన్​, ముఖ్యమంత్రి కేసీఆర్​ ప్రజలకు బోనాల శుభాకాంక్షలు తెలిపారు.

రాష్ట్ర ప్రజలంతా ఆయురారోగ్యాలతో , సుఖసంతోషాలతో సుభిక్షంగాజీవించేలా అమ్మవారి ఆశీస్సులు కలకాలం కొనసాగాలని సీఎం కేసీఆర్‌ ప్రార్థించారు.

కుటుంబసభ్యులతో కలిసి సంతోషకర వాతావరణంలో వేడుకలను నిర్వహించుకోవాలని సూచించారు. వర్షాలు, వరదల నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలన్నారు. రాష్ట్ర ప్రజలందరికీ అమ్మవారి ఆశీర్వాదాలు అందాలని గవర్నర్ ఆకాంక్షించారు.

Related posts