ఏపీ టీడీపీ నేత, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుమారుడు శివరామ్ కు మరో షాక్ తగిలింది. ఇప్పటికే కే ట్యాక్స్ వసూళ్ల విషయంలో ఆయన కుటుంబసభ్యుల పై కేసులు నమోదైన విషయం తెలిసిందే. తాజాగా, గుంటూరు, నరసరావుపేటలో శివరామ్ కు చెందిన రెండు షోరూమ్ లను అధికారులు సీజ్ చేశారు.
గుంటూరులోని చుట్టుగుంట సెంటర్ లో గౌతమ్ హోండా షోరూమ్, నరసరావుపేటలోని యర్రంశెట్టి హీరో షోరూంలు పన్నులు చెల్లించకుండా వాహనాలు విక్రయించారన్న ఆరోపణల నేపథ్యంలో వాటిని అధికారులు సీజ్ చేసినట్టు సమాచారం. ఐదేళ్లుగా ఈ వ్యవహారం కొనసాగుతున్నట్టు అధికారుల అధికారుల దర్యాప్తులో తేలింది. ఇక కోడెల బినామీ యర్రంశెట్టి మోటార్స్ లో కూడా ట్యాక్స్ లు చెల్లించకుండా 400 వాహనాలను విక్రయించినట్లు గుర్తించారు. ఇప్పటికే కోడెల సొంత పార్టీ నేతల నుంచి అసమ్మతి ఎదుర్కొంటున్నారు.
కోర్టులతో ఆటలాడితే మొట్టికాయలు తప్పవు: రేవంత్ రెడ్డి