తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ సమ్మె కొనసాగుతున్న విషయం తెలిసిందే. సూర్యాపేటలో కార్మికులకు కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి మద్దతు తెలిపారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ పాలన రాచరికానికి పరాకాష్టలా ఉందని విమర్శలు గుప్పించారు. హైకోర్టు ఆదేశాలను కేసీఆర్ లైట్ తీసుకున్నారంటూ వస్తున్న వార్తలపై స్పందిస్తూ న్యాయస్థానాలతో
మొన్నటి లోక్ సభ ఎన్నికల్లో నిజామాబాద్ లో రాష్ట్ర మంత్రి కేటీఆర్ తన చెల్లి కవితను గెలిపించుకోలేకపోయారని విమర్శించారు. నల్లగొండ జిల్లాలోని హుజూర్నగర్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పద్మావతి రెడ్డిని అక్క అని సంభోదిస్తూ ఆమెను గెలిపించుకుంటానని తెలిపారు. తెలంగాణ ఉద్యమ నేతలు ఎవరూ ఆర్టీసీ సమ్మె గురించి మాట్లాడడం లేదని, దీన్ని బట్టి టీఆర్ఎస్ లో చీలిక వచ్చినట్లు అర్థమవుతోందని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
ప్రభుత్వాన్ని కూలిస్తే రూ.100 కోట్లు ఆఫర్!