2021 సంవత్సరానికి ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డు కోసం భారత దేశం నుంచి “కూజన్గల్ తమిళ మూవీ ” ఎంపికయ్యింది .
మన దేశం నుంచి ప్రతి సంవత్సరం ఆస్కార్ అవార్డు కోసం ఒక సినిమాను ఎంపిక చేస్తారు . దేశంలోని అన్ని భాష చిత్రాలు ఈ అవార్డు కోసం పంపిస్తారు . ఫిలిం ఫెడరేషన్ అఫ్ ఇండియా సంస్థ ఈ ఎంపిక కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ఈ అవార్డు కోసం వచ్చిన చిత్రాలను చూసి ఎంపిక చెయ్యడానికి సినిమా రంగ నిపుణులతో ఒక కమిటీని ఏర్పాటు చేస్తుంది .
ఈ సంవత్సరం మలయాళ దర్శకుడు షాజీ కరుణ్ చైర్మన్ గా ఒక కమిటీని నియమించింది. ఇందులో రవీంద్ర జాదవ్ , విపుల్ మెహతా, శ్రీమతి రుమా సేన్ గుప్తా , భగీరథ , షణ్ముగం ,నవనీయత్ సింగ్ ,ఇంద్రదీప్ దాస్ గుప్త , నటి అనన్య ఛటర్జీ , సుమిత్ బసు , కె ఉమామహేశ్వర రావు , అర్ఘ్యకమల్ మిత్ర,పంపల్లి , నాగన్న, సుకుమార్ సభ్యులుగా వున్నారు.
ఆస్కార్ అవార్డు కోసం ఈ సంవత్సరం 14 సినిమాలు వచ్చాయి .
*షేర్ షా ” (హిందీ )
*మండేలా “(తమిళం )
*” షెర్ని ” (హిందీ )
*ఆట వెల్ జాలి “( మరాఠీ )
*కూజన్గల్ “(తమిళం )
*”కాగజ్ ” ( హిందీ )
*”బ్రిడ్జి ” (అస్సామీ )
*”తూఫాన్ ” హిందీ )
*చెల్లో షో ” ( గుజరాతీ )
*”గోదావరి “(మరాఠీ )
*”సర్దార్ ఉద్ధం ” ( హిందీ )
*కారఖాని సంచి వారి “(మరాఠీ )
*”నాయత్తు “(మలయాళం )
*”లైలా ఔర్ సత్ గీత్ ” (గోజ్రీ )
ఈ సంవత్సరం తెలుగు, కన్నడ సినిమాలు రాలేదు.
కలకత్తా లో వారం రోజులపాటు 14 ఈ సినిమాలను చూసిన కమిటీ “కూజన్గల్ తమిళ మూవీ “ను ఎంపిక చేసింది . శనివారం కోల్ కతా లోని లలిత్ గ్రేట్ ఈస్టర్న్ హోటల్ లో జరిగిన పాత్రికేయుల సమావేశంలో కమిటీ చైర్మన్ షాజీ ఆస్కార్ అవార్డు కోసం భారత దేశం నుంచు కూజన్గల్ ” తమిళ మూవీను ఎంపిక చేసినట్టు ప్రకటించారు . ఈ సమావేశంలో కమిటీ సభ్యులు , ఎఫ్ .ఎఫ్ .ఐ ప్రతినిధులు సుప్రసేన్ , అనింద్య దాస్ గుప్తా పాల్గొన్నారు .
– భగీరథ
కోల్ కతా నుంచి . .
జగన్ ను సపోర్ట్ చేసినందుకు ఆ నిర్మాత సినిమాలోంచి తీసేశారు… : పోసాని