తెలుగులో “భరత్ అనే నేను” చిత్రంతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న బాలీవుడ్ హాట్ బ్యూటీ కియారా అద్వానీ. ఈ భామ హిందీలో “లస్ట్ స్టోరీస్” అనే వెబ్ సిరీస్ తో తనలోని హాట్ నెస్ బయటపెట్టి యూత్ లో మంచి క్రేజ్ ను సొంతం చేసుకుంది. ఆ తరువాత రామ్ చరణ్ సరసన “వినయ విధేయ రామ” అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చినా… ఆ సినిమా పెద్దగా హిట్ కాలేదు. ఇక ఇటీవల బాలీవుడ్ లో విడుదలైన “అర్జున్ రెడ్డి ” రీమేక్ “కబీర్సింగ్” చిత్రంతో కెరీర్లో భారీ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది కియారా అద్వానీ. ప్రీతి పాత్రలో సహజనటనతో ఆకట్టుకున్నది. ఈ సక్సెస్తో బాలీవుడ్లో బిజీగా మారిపోయింది. ప్రస్తుతం కియారా “గుడ్న్యూస్”, “లక్ష్మీబాంబ్”, “షేర్షా”, “మర్జావా” సినిమాలు చేస్తోంది. కియారా అద్వానీ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్గా ఉంటారు. తాజాగా ఆమె ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయ్యింది. ఈ విషయాన్ని కియారా స్వయంగా తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో ఫ్యాన్స్కు తెలియజేసింది. తన టీమ్ హ్యాక్ అయిన తన ట్విట్టర్ అకౌంట్ పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తున్నారని పేర్కొంది. తన పేరుతో ఉన్న ఇతర అకౌంట్లను చూసి మోనసోవద్దని అభిమానులకు కియారా సూచించింది.
previous post
next post