విలక్షణ నటుడు కమల్హాసన్ మరోసారి ఆసుపత్రిలో చేరారు. ఇటీవల అమెరికా వెళ్లి తన దుస్తుల బ్రాండ్ ‘హౌస్ ఆఫ్ ఖద్దర్’ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నాడు. అనంతరం అక్కడి నుంచి ఇండియా తిరిగి రాగానే కోవిడ్ ఉన్నట్టుగా తేలింది. ఈ మేరకు ఆయన చెన్నైలోని శ్రీరామచంద్ర హాస్పటల్ లో పది రోజులు పాటు ట్రీట్మెంట్ తీసుకున్నారు. కోవిడ్ తగ్గాక తిరిగి రెగ్యులర్ పనుల్లో పడ్డారు.
తాజాగా ఆయన మరోసారి చైన్నైలోని ప్రముఖ శ్రీరామచంద్ర ఆసుపత్రిలో చేరడంతో అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. అయితే ఆయన రెగ్యులర్ చెకప్ కోసం మాత్రమే ఆసుపత్రిలో చేరినట్లు సమాచారం. జనరల్ చెకప్ అనంతరం ఆయన్ను డిశ్చార్జి చేయనున్నట్లు తెలుస్తుంది. కాగా కమల్ హోస్ట్ చేస్తున్న బిగ్బాస్ సీజన్5 ఫినాలే ఆదివారం పూర్తయిన సంగతి తెలిసిందే.
కాగా కమల్ ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ‘విక్రమ్’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం చివరిదశలో ఉంది. అలాగే కమల్ అటు శంకర్ దర్శకత్వంలోనూ మధ్యలో ఆగిపోయిన తన ‘ఇండియన్-2’ సినిమా షూటింగ్ ను కూడా తిరిగి ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నాడు.
ప్రస్తుతం అగ్రస్థానంలో టాలీవుడ్… : కంగనా