కాజల్ తెలుగులో మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’.. మంచు విష్ణు ‘మోసగాళ్లు’ చిత్రాల్లో నటిస్తోంది. ఇక తమిళంలో కమల్ హాసన్ ‘ఇండియన్ 2’ మరియు ‘హే సినామికా’ అనే సినిమాలో నటిస్తోంది. తాజాగా కాజల్ ఇండస్ట్రీలో ఏర్పడిన క్రైసిస్ కారణంగా డేరింగ్ డెసిషన్ తీసుకుందట. కరోనా నేపథ్యంలో నిర్మాతలకు అండగా ఉండటానికి కోలీవుడ్ లో కొంత మంది హీరోహీరోయిన్లు.. డైరెక్టర్లు స్వచ్ఛందంగా రెమ్యూనరేషన్స్ తగ్గించుకుంటున్నారు. ఈ క్రమంలో చందమామ కాజల్ అగర్వాల్ కూడా పారితోషకాన్ని తగ్గించుకోబోతోందట. ఇకపై తాను నటించబోయే సినిమాలకి రెమ్యూనరేషన్ తగ్గించుకోనున్నట్లు మేకర్స్ తో చెప్తోందట. ఇక సినీ పరిశ్రమలో సుమారు రెండు దశాబ్దాలుగా పలు భాషల్లో రాణిస్తున్న కాజల్ అగర్వాల్ స్టార్ హీరోయిన్గా అగ్రహీరోలతో పాటుగా యంగ్ హీరోలతో కూడా కలిసి నటిస్తోంది.
previous post
మాజీభర్త పెళ్లిపై హీరోయిన్ షాకింగ్ కామెంట్స్