దేశంలో కరోనా వైరస్ వ్యాపిస్తున్న నేపథ్యంలో పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై సందిగ్ధత నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల కమిషన్ సమాలోచనలు చేస్తోంది. ఎన్నికల ప్రచారాలు, సమావేశాల నిర్వహణపై అభిప్రాయాలు తెలపాలని జాతీయ, ప్రాంతీయ పార్టీలను ఎన్నికల సంఘం కోరింది. తమ అభిప్రాయాలను పంపేందుకు ఈ నెల 31 వరకు సమయం ఇస్తున్నట్లు తెలిపింది.
కరోనా విజృంభణ నేపథ్యంలో ఎన్నికల నిర్వహణ సవాలుగా మారింది. బీహార్ అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాది అక్టోబరులో జరగాల్సి ఉంది. ఎన్నికల కమిషన్ ఆ రాష్ట్రంలోని పార్టీలతో ఇప్పటికే వర్చువల్ సమావేశం నిర్వహించింది. అలాగే, కరోనా రోగులకు పోస్టల్ బ్యాలెట్ పద్దతిలో ఓటు వేసే అవకాశాన్ని కల్పించింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో బీజేపీ సహా పలు పార్టీలు వర్చువల్ పద్ధతిలోనే సమావేశాలు నిర్వహిస్తున్నాయి.
హైద్రాబాద్ అభివృద్దికి వైఎస్ ఏనాడు అడ్డుపడలేదు: చంద్రబాబు