telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

అయోధ్య రామమందిర నిర్మాణానికి కింగ్ ఖాన్ భారీ విరాళం ?

Ayodhya

బాలీవుడ్ లో రెండు రోజులుగా ఓ వార్త చక్కర్లు కొడుతుంది. ఓ స్టార్ హీరో రామ మందిరానికి భారీగా విరాళం ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. కింగ్ ఖాన్ షారుక్ రామ మందిర నిర్మాణం కోసం ఏకంగా రూ. 5 కోట్లు విరాళంగా ఇచ్చారట. ఈ న్యూస్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అయితే దీనిపై ఎటువంటి అధికారిక సమాచారం లేదు. రామ మందిర నిర్మాణ కమిటీ కానీ, షారుక్ ఖాన్ కానీ ఈ విషయంపై స్పందించలేదు. కానీ ఇదో ఫేక్ న్యూస్ అని తేలిపోయింది. దశాబ్దాలుగా సాగుతున్న అయోధ్య వివాదానికి ముగింపు పలికిన బీజేపీ ప్రభుత్వం రామ మందిర నిర్మాణానికి, మసీదు నిర్మాణానికి వేరువురుగా స్థలాలు కేటాయించింది. ఇక రామ మందిర నిర్మాణానికి కేటాయించిన భూమిలో ఆగస్టు 5వ తేదీన ప్రధాని మోడీ శంకుస్థాపన చేయడం జరిగింది. కోట్ల వ్యయంతో రామ మందిరాన్ని అద్భుతంగా నిర్మించనుంది ప్రభుత్వం.

Related posts