ఏపీ హైకోర్టు కొత్త చీఫ్ జస్టిస్ గా అరూప్ కుమార్ గోస్వామి నియామకం అయ్యారు. ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ అరూప్ గోస్వామితో ప్రమాణ స్వీకారం చేయించారు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఈ ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన సీఎం జగన్, సీఎస్ ఆదిత్యనాధ్ దాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా చీఫ్ జస్టిస్ అరూప్ గోస్వామికి శుభాకాంక్షలు తెలిపారు గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్, సీఎం జగన్. ఈ కార్యక్రమం అనంతరం సీఎం జగన్ తుమ్మలపల్లి కళాక్షేత్రం నుంచి తాడేపల్లిలోని ఆయన నివాసానికి పయనమయ్యారు. అంతకుముందు జస్టిస్ అరూప్ గోస్వామి బెజవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. బుధవారం ఉదయం సతీసమేతంగా ఆలయానికి వెళ్లిన ఆయనకు దేవాలయ అధికారులు ఘనస్వాగతం పలికారు. వేకువజామున జరిగిన పంచహారతుల సేవలో పాల్గొన్నారు. అనంతరం అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందించారు.
next post


దిశ ఘటన : ఎన్కౌంటర్పై బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ సంచలన వ్యాఖ్యలు