telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ఫామ్ హౌజ్ నుండి కుంభకర్ణుడిలా నిద్ర లేచాడు : కెసిఆర్ పై రాములమ్మ ఫైర్

సిఎం కెసిఆర్ పై మరోసారి బిజేపి నేత విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేశారు. “తెలంగాణలో రైతులు తాము పండించిన పంటను అమ్ముకోవడానికి గోస పడుతున్నారు. మూడు నాలుగు వారాలుగా ధాన్యం అమ్మకాలు లేకపోవడంతో రైతులు కల్లాల దగ్గరే పడిగాపులు కాస్తున్నారు. ఒకవైపు కరోనా, మరోవైపు అకాలవర్షాలతో రైతులు గజగజలాడుతున్నారు. రాష్ట్రాన్ని పాలిస్తున్న సీఎం గారు మాత్రం ఫామ్ హౌజ్ నుండి కుంభకర్ణుడు నిద్ర లేచినట్లు…. లేవగానే హడావుడిగా గాంధీ, ఎంజీఎం హాస్పిటల్స్ పోయి షో చేసి వచ్చిండ్రు. ఒక్క పైసా ఇయ్యలే, ఒక్క సమస్య తీర్చలే. పైనుంచి హెలికాఫ్టర్‌లోనే పోయిండ్రు కదా… కింద రైతులు ధాన్యం పోసుకుని, తడిచిన ధాన్యం దగ్గర కూర్చుని ఏడుస్తున్న దృశ్యాలు కనిపించే లేదా? రైతునని చెప్పుకునే సీఎం, వరంగల్‌కు పోయేటప్పుడో, వచ్చేటప్పుడో రోడ్డు మార్గాన వచ్చి, రైతుల్ని కలిసి ఉంటే తెలిసేది. రైతు ధాన్యం తడిచిపోవడానికి ఈ ప్రభుత్వానిదే బాధ్యత. ఆలస్యం లేకుండా కొనుగోలు చేసి ఉంటే ఇంతగా ధాన్యం తడిచిపోయేది కాదు. రైతులకు ఎదురవుతున్న సమస్యల్ని చెప్పుకునేందుకు ఒక వ్యవస్థ అంటూ లేకుండా పోయింది. వర్షానికి భయపడి రైతులు అడ్డికి పావు సేరు ధరకు ప్రైవేటు వ్యాపారులకు ధాన్యాన్ని అమ్ముకుంటున్నారు. ఇంకో రెండు వారాల్లో వర్షాకాలం ప్రారంభం కాబోతోంది. ఆ లోగా కల్లాలను ఖాళీ చేయకపోతే రైతులు తీవ్రంగా నష్టపోతారు. రైతు కష్టాలు వెంటనే పరిష్కారం కావాలన్న ఆకాంక్షతో సోమవారం (24-05-2021వ తేదీ) ఉదయం 10:00 గంటల నుండి మధ్యాహ్నం 1:00 వరకు “తెలంగాణ రైతు గోస – బీజేపీ పోరు దీక్ష” చేపట్టాలని నిర్ణయించడం జరిగింది.” అంటూ విజయశాంతి పేర్కొన్నారు.

Related posts