అక్రిడిటేషన్ కలిగిన జర్నలిస్టులంతా హెల్త్ స్కీంను సద్వినియోగం చేసుకోవాలని సమాచారశాఖ ఏడీ వేణుగోపాల్రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. కడప జిల్లాలోని అక్రిడిటేషన్ కలిగిన జర్నలిస్టులందరూ 2019-20 హెల్త్ కార్డుల పునరుద్ధరణకు ధరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.
కొత్త కార్డుల నిమిత్తం ఆగస్టు 13లోగా ఆన్లైన్లో నిర్ణీత పద్దునకు రూ.1250 ప్రీమియం చెల్లించాలని పేర్కొన్నారు. ఈ మేరకు రాష్ట్ర కమిషనరు కార్యాలయం నుంచి జిల్లాకు ఆదేశాలు జారీ అయ్యాయన్నారు. హెల్త్కార్డులు రెన్యువల్ చేయదలచుకున్న వారు ఆన్లైన్ ద్వారా నగదు చెల్లించిన అనంతరం సంబంధిత చలానాతో పాటు అక్రిడిటేషన్ కార్డు, పాత హెల్త్ కార్డులు జిరాక్స్ కాపీలతో సమాచారశాఖ ఏడీ కార్యాలయంలో వచ్చే నెల 13వ తేదీలోగా సమర్పించాలన్నారు.