ప్రపంచమంతా అమెరికా ఎన్నికలు ఎంతో ఆత్రుత రేకెత్తిన విషయం తెలిసిందే. అందులో బైడెన్ విజయం సాధించారు. అది కొందరికి తీపి కబురైనా మరి కొందరికి మాత్రం అది అత్యంత చేదు కబురుగా మారింది. ఈ విషయాన్ని విషంతో సమానంగా, ఏ మాత్రం తక్కువగా పరిగణించని వారిలో ట్రంప్ కూడా ఒకరు. తన ఓటమిని ఒప్పుకోనని ఇటీవల అన్న విషయం తెలిసిందే. అవసరమైతే సుప్రీం కోర్టుకు వెళతానని ఆయన అన్నారు. అయితే దానిపై ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పందించారు. ట్రంప్ తన ఓటమిని ఒప్పుకోకపోవడం ఎంతో సిగ్గు చేటుగా ఉందని అన్నారు. అయితే పదవి విరమణ సమాయానికైనా ఓటమిని అంగీకరిస్తారని అనుకుంటున్నానంటూ ట్రంప్ తన ఓటమిని ఒప్పుకోకపోవడంపై చెప్పుకొచ్చారు. అంతేకాకుండా దేశ ప్రజలు అందరూ దేశం బాగుపడాలనే కోరుకుంటారని, ఈ సారి వారు తీసుకున్న నిర్ణయం ద్వారా వారి కోరికను నిజం చేసేందుకు ప్రచత్నిస్తానని, అంతేకాకుండా దేశంలో ఉన్నా నీచ రాజకీయాల్ని తొలగిస్తానని ఆయన తెలిపారు.
previous post
next post