telugu navyamedia
ఆంధ్ర వార్తలు క్రైమ్ వార్తలు రాజకీయ వార్తలు

జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డిలకు బెయిల్ మంజూరు

jc prabhakar reddy

ట్రాన్స్ పోర్ట్ స్కాం కేసులో టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డిలకు అనంతపురం కోర్టులో ఊరట లభించింది. వారిపై నమోదైన మూడు కేసుల్లో షరతులతో కూడిన బెయిల్ ను కోర్టు మంజూరు చేసింది. తాడిపత్రిని వదిలి ఎక్కడకూ వెళ్లకూడదని షరతు పెట్టింది.

వాహనాల కొనుగోలు కుంభకోణంలో జూన్ 13న ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ లను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం కడప సెంట్రల్ జైల్లో ఉన్న వీరిద్దరూ ఇప్పుడే జైలు నుంచి విడుదలయ్యే అవకాశం లేదు. ఎందుకంటే మరో మూడు కేసుల్లో వీరు బెయిల్ పొందాల్సి ఉంది. మరోవైపు, అన్ని కేసుల్లో బెయిల్ ఇవ్వాలంటూ వీరిద్దరూ పెట్టుకున్న బెయిల్ పిటిషన్ ను ఏపీ హైకోర్టు ఇటీవలే కొట్టేసింది.

Related posts