ప్రముఖ సినీ నటి జయప్రద నేడు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా బీజేపీ కండువాను కప్పి పార్టీలోకి జయప్రదను ఆహ్వానించారు. పలువురు నేతలు ఆమెకు అభినందనలు తెలిపారు. ప్రధాన మంత్రి మోదీ నేతృత్వంలో దేశం కోసం పని చేయడం తన అదృష్టంగా భావిస్తున్నట్టు జయప్రద చెప్పారు. యూపీలోని రాంపూర్ నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా ఆమె పోటీ చేస్తున్నట్టు సమాచారం.
రాంపూర్ నియోజకవర్గం నుంచి గతంలో బీఎస్పీ పార్టీ తరపున ఆమె పోటీ చేశారు. తిరిగి ఇదే నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున ఆమె బరిలోకి దిగనున్నారు. టీడీపీ, వైసీపీలో జయప్రద చేరతారని ఓ దశలో ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. కానీ చివరికి ఆమె బీజేపీ వైపు మళ్లడం విశేషం.