telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

కరోనాతో టాలీవుడ్ ప్రముఖ సింగర్ కన్నుమూత

చైనా లో పుట్టిన కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తోంది. ఇప్పటికే చాలా దేశాలు ఈ వైరస్ కారణంగా కుదేలు అయ్యాయి. ఇక మన దేశంలోనూ ఈ వైరస్ విలయం కొనసాగుతూనే ఉంది. అటు ఇప్పటికే రాజకీయ నాయకులకు, సినిమా స్టార్లకు, ప్రముఖులకు కరోనా సోకింది. ముఖ్యంగా సినిమా పరిశ్రమలో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. దీంతో షూటింగ్ లు ఆగిపోతున్నాయి. అయితే తాజాగా ప్రముఖ గాయకుడు, సంగీత దర్శకుడు జి. ఆనంద్ (67) కరోనాతో గురువారం రాత్రి కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన కరోనాతో బాధపడుతున్నారు. సకాలంలో వెంటిలేటర్ లభించకపోవడంతో ఆనంద్ తుది శ్వాస విడిచారని తెలుస్తోంది. శ్రీకాకుళం జిల్లా పులగమ్ గ్రామంలో జన్మించిన ఆనంద్ పూర్తి పేరు గేదల ఆనందరావు. చిన్నతనంలోనే తన తండ్రి దగ్గర సంగీతాన్ని అభ్యసించారు. ఆనంద్ తండ్రి రంగస్థల నటుడు. ఆయన రాముడి పాత్ర పోషిస్తే, ఆనంద్ అతని సోదరుడు లవ, కుశులుగా నటించేవారు. బాల్యం నుండే పాటలు పాడటం అలవాటైన ఆనంద్, అనేక పోటీలలో బహుమతులు సంపాదించుకున్నారు. ఇక ఆయన మృతి పట్ల చిరంజీవి తో సహ పలుగురు సంతాపం తెలిపారు. 

Related posts