ప్రతి సంవత్సరం ఎంతో ఘనంగా జరిగే హైదరాబాద్ లష్కర్ బోనాల జాతరకు ఈసారి కరోనా వ్యాప్తితో కళతప్పింది. కరోనా నియంత్రణ చర్యలలో భాగంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈసారి అమ్మవారి ఆలయంలోనే అధికారులు, వేదపండితుల సమక్షంలోఅమ్మవారికి ఆదివారం బోనం సమర్పించనున్నారు. కరోనా వ్యాప్తికారణంగా ఈసారి లష్కర్బోనాలకు భక్తులనెవరినీ ఆలయంలోకి అనుమతించరు.
ప్రభుత్వ ఆదేశాల మేరకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ శుక్రవారం తన నివాసంలో మహంకాళి అమ్మవారికి పట్టు వస్త్రాలను అందజేశారు. ఈ సందర్భంగా భక్తులు ఎవరికివారు తమ ఇళ్లలోనే అమ్మవారికి బోనాలు సమర్పించాలని మంత్రి సూచించారు. ఈ సందర్భంగా ఆలయన ఈవో మనోహర్రెడ్డి, ఆలయ పండితులు మంత్రి తలసాని నుంచి పట్టు వస్త్రాలను స్వీకరించారు.
లోకేశ్ నేరుగా మాట్లాడలేరు… ట్విట్టర్లో ఏదో ఒకటి చెబుతారు: బొత్స