telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ

గాజువాకలో పవన్‌ ఓటమి.. భీమవరంలో వెనుకంజ

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు వెలువడుతున్న సంగతి తెలిసిందే. జనసేన అధినేత పవన్‌కల్యాణ్
 భీమవరం, గాజువాక నుంచి పోటీ చేశారు. గాజువాకలో పవన్‌పై వైసీపీ అభ్యర్థి నాగిరెడ్డి గెలుపొందారు. అయితే గాజువాక నుంచి ఓడిపోయారు. భీమవరం ఫలితాలు తేలాల్సి ఉంది. 

ఏపీలో మొదటి సారి ఎన్నికల్లో దిగిన జనసేన ఒక్క ఖాతా కూడా తెరువకపోవడం గమనార్హం. పవన్ ఓటమిని ఆ పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే భీమవరంలో కూడా పవన్ వెనుకంజలో ఉన్నారు. అక్కడ సమీప వైసీపీ అభ్యర్థి గ్రంధి శ్రీనివాస్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇటీవల మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ పవన్ అసెంబ్లీలో అడుగు పెడుతారని జోస్యం చెప్పిన విషయం తెలిసిందే.

Related posts