telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కు కరోనా

gajendra singh on polavaram tenders cancellation

దేశంలో కరోనా విజృంభించడంతో రోజురోజుకూ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ట్విట్టర్ ద్వారా తెలిపారు. తనలో కొన్ని లక్షణాలు కనిపించడంతో కరోనా టెస్టులు చేయించుకోగా పాజిటివ్ అని తేలిందని పేర్కొన్నారు.

వైద్యుల సూచన మేరకు హాస్పిటల్ లో చేరనున్నట్టు తెలిపారు. తనతో కాంటాక్ట్ లోకి వచ్చిన వారంతా జాగ్రత్తగా ఉండాలని కోరారు. కరోనా లక్షణాలు కనిపిస్తే వెంటనే టెస్ట్ చేయించుకోవాలని చెప్పారు. పాజిటివ్ అని తేలితే ఐసొలేషన్ లోకి వెళ్లాలని సూచించారు. మరోవైపు రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టుకు సంబంధించి అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ జరగనుంది. ఈ సమావేశానికి ఇరు తెలుగు రాష్ట్రాల అధికారులు హాజరుకానున్నారు. కేంద్ర మంత్రికి కరోనా రావడంతో ఈ సమావేశం వాయిదా పడే అవకాశం ఉంది.

Related posts