telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

వ్యక్తిగత ప్రయోజనాల కోసమే మూడు రాజధానులు: పవన్

pawan

సీఎం జగన్ మోహన్ రెడ్డి వ్యక్తిగత ప్రయోజనాల కోసమే మూడు రాజధానులు ఏర్పాటు చేస్తున్నారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ మండిపడ్డారు. జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమావేశం అనంతరం మీడియాకు ఓ ప్రకటనను విడుదల చేశారు. టీడీపీ, వైసీపీలు రాజధాని రైతుల జీవితాలతో ఆడుకుంటున్నారని జనసేన నేతలు అభిప్రాయం వ్యక్తం చేశారు.

రాజధాని రైతులకు అండగా నిలబడాలని పవన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. న్యాయపరంగా కూడా అమరావతికి మద్దతుగా పోరాడాలని తీర్మానించారు. టీడీపీ ప్రభుత్వంలో చేసిన తప్పులను ఇప్పుడు అధికారంలో ఉన్న వైసీపీ కూడా స్వార్ధానికి ఉపయోగించుకుంటోందని పవన్ చెప్పుకొచ్చారు. రైతుల కన్నీరు పెట్టకుండా భూములు తీసుకోవాలని నాడు చెప్పామన్న విషయాన్ని పవన్ గుర్తు చేశారు.

గతంలోనే మరో ప్రభుత్వం వచ్చినా రైతులకు అన్యాయం జరగకుండా చట్టం ఉండాలని జనసేన సూచించిందని పవన్ తెలిపారు. ఆనాడు తమ పార్టీ మాటలను ఎవరూ పట్టించుకోలేదని నేడు జరుగుతున్న పరిణామాలకు టీడీపీనే బాధ్యత వహించాలని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్మాణాలను పూర్తి చేయకుండా మధ్య లోనే ఆపివేయడం టీడీపీ చేసిన అతి పెద్ద తప్పని పవన్ పేర్కొన్నారు.

Related posts