అగ్రరాజ్యం అమెరికాలో జూలై 4న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. అయితే రీవాల్యుషనరీ కమ్యూనిస్ట్ పార్టీకి చెందిన ఇద్దరు నిరసనకారులు వైట్హౌస్ వద్ద ఆందోళనకు దిగారు. అనంతరం ఆ దేశ జాతీయ జెండాకు నిప్పుపెట్టారు. ఈ ఘటన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన నివాసం నుంచి లింకన్ మెమోరియల్ వద్ద ప్రసంగానికి వెళ్లే కొన్ని గంటల ముందు చోటుచేసుకోవడంతో కలకలంగా మారింది. దీంతో వెంటనే అప్రమత్తమైన రక్షణ బలగాలు ఆ ఇద్దరు ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నాయి. ఆ సమయంలో నిరసనకారులు ట్రంప్పై తీవ్ర వ్యతిరేకతను ప్రదర్శించడంతో పాటు “అమెరికా ఎప్పటికీ గొప్పది కాదంటూ” నినాదాలు చేశారు. ఈ ఘటన నేపథ్యంలో వైట్హౌస్ వద్ద కొద్దిసేపు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.
previous post